Read Romance books for free


A big variety of genres offers in worldlibraryebook.com. Today we will discuss romance as one of the types books, which are very popular and interesting first of all for girls. They like to dream about their romantic future rendezvous, about kisses under the stars and many flowers. Girls are gentle, soft and sweet. In their minds everything is perfect. The ocean, white sand, burning sun….He and she are enjoying each other.
Nowadays we are so lacking in love and romantic deeds. This electronic library will fill our needs with books by different authors.


What is Romance?


Reading books RomanceReading books romantic stories you will plunge into the world of feelings and love. Most of the time the story ends happily. Very interesting and informative to read books historical romance novels to feel the atmosphere of that time.
In this genre the characters can be both real historical figures and the author's imagination. Thanks to such historical romantic novels, you can see another era through the eyes of eyewitnesses.
Critics will say that romance is too predictable. That if you know how it ends, there’s no point in reading it. Sorry, but no. It’s okay to choose between genres to get what you need from your books. But in romance the happy ending is a feature.It’s so romantic to describe the scene when you have found your True Love like in “fairytale love story.”




Read romance online


On our website you can read books romance online without registration. Every day spent some time to find your new favourite book in the coolest library. Tablets and smartphones are the most-used devices to read electronic books. Our website is very easy to use. No need for registration. Access around the clock.
Let your romantic story begin with our electronic library.

Read books online » Romance » అప్రాశ్యులు by Bhimeswara Challa (the reading list book TXT) 📖

Book online «అప్రాశ్యులు by Bhimeswara Challa (the reading list book TXT) 📖». Author Bhimeswara Challa



1 ... 10 11 12 13 14 15 16 17 18 ... 21
Go to page:
అది చూచి అందరు కంటతడి పెట్టారు. ఆశ్చర్యకరమయినదేమంటే రజని కళ్ళలో కన్నీటి చాయలే లేవు. నేత్రద్వయం జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి. ఆమెను రెండు చేతులతో ఆప్యాయంగా చేరదీసి “మనస్సుని చక్కబెట్టుకోవాలమ్మా, కన్నీరు కార్చవలసిన సమయం ఇంకా రాలేదమ్మా, మీ కుమారుడు నాకు వారు భర్త సమామలు” అంది.

ఆ చివరి మాటలిని అందరు నిశ్చేష్టులయ్యేరు. రామం ముఖంలో కత్తి వేసినా నెత్తురు చుక్క లేదు.

“వారు నన్నొకసారి అడిగేరు. మనస్సులో నువ్వు నన్ను భర్తగా స్వీకరించే సహాయం నీలో వుండాలని, స్వీకరించి ఏమి చేసేవంటే నేమి చెప్పలేదు. వారి మనశ్శాంతి కోసం స్వీకరిస్తానని చెప్పేను. అంది రజని.

వినోద్ తల్లి ఏడుస్తూ నువ్వు మాపాలిటి దేవతవమ్మా నీ ప్రార్థన కూడానా శ్రీరామ చంద్రుడు, ఆలకించలేదా? అంది.

“నేను ఎప్పుడు ఎవరిని ప్రార్థించలేదమ్మా? నాకు చేతనయినదంతా నేను చేసాను” అంది.

రజని మాటల అర్ధం ఎవరు పూర్తిగా ఇంకా గ్రహించలేదు. రామం బయటకు వెళ్ళిపోయాడు. అది గమనించి విశాల కూడా అతనిని అనుకరించింది. రామం చర చర నడచి వెళ్ళిపోతున్నాడు.

విశాల వెనుక నుంచి రామం బాబు, అని పిలిచింది. పిలుపు విని రామం ఆగి, వెనుదిరిగి చూచాడు. విశాల దగ్గరకు వచ్చి “ఎక్కడకు వెళ్ళిపోతున్నారురామం బాబు” అంది.

రామం ముఖంలో నిరుత్సాహం, నిస్పృహ, ధైర్యం తాండవిస్తున్నాయి. “ఇక ఎక్కడికయితే నేమిటి విశాల” అన్నాడు.

“తొందరపడకండి రాంబాబు” అంది విశాల

"తొందరపడి చేసినా, తొందరపడకుండా చేసినా ఫలితం ఇప్పుడు వొక్కటే విశాలా. త్వరలో డిల్లీ వదలి వెళ్ళిపోతాను" అన్నాడు రామం.

"మీరు ఏమి చెయ్యాలొ నేనేమీ చెప్పలేను. కాని కొద్దిరోజుల వరకు మీరు తొందరపడకండి. వినోద్ పరిస్థితి ఇలా వున్నప్పుడు మీరు ఏం చేసినా అసంగతంగా వుంటుంది" అంది విశాల.

హృదయాన్ని రగిల్చివేసే యీ బడబాగ్నిని త్రుంచి, నేనిక్కడ వొక్కక్షణం కూడా వుండలేను విశాలా?"అన్నాడు

"సరే ఇప్పుడు వెళ్ళండి. కాని అప్పుడప్పుడు వస్తూండండి. లేకపోతే రజని చాలా బాధపడుతుంది"అండి.

రామం సరేనని వెళ్ళిపోయాడు. విశాల తిరిగి లోపలికి వచ్చింది. అప్పటికి వినోద్‌కి తిరిగి స్పృహ వచ్చింది. ప్రక్క మీద వినొద్ తల్లిదండ్రులు కూర్చుని వున్నారు. రజని దగ్గర వున్న కుర్చీలో కూర్చుని వుంది.

వినోద్ రజనిని ఉద్దేశించి అంటున్నాడు. “మరణించిన తరువాత నాకేదైనా శక్తి సంక్రమిస్తే ఆ సర్వస్వం నీకోసం వినియోగిస్తాడు. నాకు చేతనయితే ప్రపంచానికంతకు నిన్ను రాణిని చేసి, అందరు నీ పాదాలు తాకేటట్లు చేస్తాను" అన్నాడు.

ఎంతో ప్రయత్నపూర్వకంగా శరీరంలొ మిగిలిన బలమంతావినియోగించి అనిన మాటలివి. అయినా ఆ ప్రయత్నానికే శరీరం తట్టుకోలేకపోయింది. శరీరం మీద స్పృహ మళ్లీ పోయింది. డాక్టర్ సనల్ నాడి పరీక్షించి, అతి బలహీనంగా వుంది. అంతా బయటకు వెళ్ళిపోవాలి. రోగి మాట్లాడకూడదు.

అందరు బయటికి వచ్చేసారు. డాక్టర్ ఎంత ప్రయత్నించినా తిరిగి స్పృహ రాలేదు. సుమారు తెల్లవారు జామున మూడు గంటలకు వినోద్ తోటిమానవులను శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయాడు.

 

చాప్టర్ 12

వినోద్ మరణం రజనికి గొడ్డలిపెట్టులా హృదయంలో తగిలింది. పట్టుదలతో తన సర్వస్వాన్ని ధారపోసి ఏ పని సాధించాలని ప్రయత్నించిందో అది విఫలమయింది. హృదయంలో తీరని వెలితి ఏర్పడింది. మనస్సులో అశాంతి చెలరేగింది. వినోద్‌ని నిజంగా ఆమె ప్రేమించిందో లేదో చివరకు ఆమెకు కూడా తెలియదు. వినోదంటే అపరిమితమైన సానుభూతి, అంతులేని జాలి అనుగుణము ఆమె హృదయంలొ ఆమె గుర్తించగలిగింది. వినోద్‌ని రక్షించటంతన కర్తవ్యమని ఆమె భావించింది. ఆ నిశ్చయంతోనే ఆమె ముందడుగు వేసింది. సాధకబాధకాలు, అష్టకష్టాలు, పరిస్థితుల పరిణామాలు, ఆప్తులు ఆత్మీయులు ఇవన్నీ ఆమె ప్రక్కకు త్రొసివేసి, ఆమె మృత్యువుతో పోరాడింది. జీవితంలోమొదటిసారిగా ఆమె ఓటమిని అంగీకరించక తపట్లేదు. ఆనాడు రామం అకస్మాత్తుగ అలా బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఆమె గ్రహించింది. తరువాత విశాలకూడ చెప్పింది. రామం అన్న మాటలువిని రజని బాధపడింది. వినోద్ తల్లిదండ్రులను ఓదార్చే భారం ఆమెమీద పడింది. తన దుఃఖాన్ని దిగమింగి ఆమె వారిని ఓదార్చడానికి ప్రయత్నించింది. కాని అంతులేని పుత్రశోకం వారిది. ఒక్కగానొక పుత్రుడు అనేక సంవత్సరాలు పోయిన తరువాత మరణశయ్యమీద తిరిగి లభించాడు. వారి ప్రార్థనలను పెడచెవిని పెట్టి దైవం వారికి ద్రోహదం చేసాడు.

రజని వారికి కొద్దికాలంలోనే గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి. పండు యవ్వనంలో వున్న అపురూప సౌందర్యవతి ఆ అభాగ్యుడయిన వారి పుత్రుని యెడ కనబరచిన ఆదరాభిమానాలు, శద్ధాశక్తులు, వారి హృదయాలని కదలించి వేశాయి. మనస్సులో పలుమార్లు ఆ వృద్ధ దంపతులు ఈమె నా కోడలయితే ఎంత బావుండును అని అనుకునేవారు. చివరకు ఆ మాటలు ఆమె నోటి వెంట వినడం తటస్థించేసరికి వారికి దుఃఖము, సంతోషము రెండూ కలిగాయి. వారిద్దరు రజనిని వారితోకలకత్తా వచ్చి వారితో కలిసి జీవించమని ప్రాధేయపడ్డారు. వంటరిగా నువ్వెందుకు ఇక్కడవుండాలి తల్లీ? మాకు కావలసినంత సంపద వుంది అనుభవించే వారు లేరు. ఇక అదంతా నీదే. ముసలివారం. మమ్మల్ని కని పెట్టి వుండేవారు లేరు. భారమంతా నీవే వహించి పుత్రశోకంతో బాధపడుతున్న మమ్మల్ని కరుణించు తల్లీ?”అంది వినోదు తల్లీ.ముసలాయన కూడా “అవునమ్మా రజనీ, ఇక మాకు నీకన్న ఆప్తులెవరు లేరమ్మా ! ఇంత జరిగిన తరువాత ఇంకా ఎన్నాళ్ళు బతుకుతామమ్మా, మా తరువాత ఏలాగయినా మా సర్వస్వము నీకే వస్తుంది. అంతవరకు కనిపెట్టి వుండే భారం కూడా నీదేనమ్మా! అన్నాడు.

సహృదయంతో, సదుద్దేశ్యంతో పలికిన మాటలవి. కాని వాటిలో అంతరార్ధం ఆమె గ్రహించకపోలేదు. రజని క్షణకాలం ఆలోచించింది. నిజంగా వారిపట్ల సానుభూతి ఆమెకు కలిగింది.

వృద్దులు పుత్రశోకంలో వున్నారు. ఎంతో ఆదరంతో ఆమెని ఆదరించారు. కాని వారి ఆహ్వానాన్ని అంగీకరిస్తే కలిగే పరిణామాలు ఆమె వూహించగలిగింది. మనస్సులో రామం మెదిలాడు. తక్షణం ఆమె నిశ్చయానికి వచ్చింది.

“మీ ఆదరానికి కృతజ్ఞురాలిని అమ్మా! కాని అది వీలు లేదు. నేనిక్కడ వుద్యోగం చేస్తున్నాను. అది వదలి రావటానికి వీలు లేదు” అంది.

“నీకు వుద్యోగం చేయ్యవలసిన అవసరమేముందమ్మా మావద్ద కావలసిన సిరిసంపదావున్నాయి. అదంతా ఇకనుంచీ నీదే” అన్నారు,

“అదంతా నేనేం చేసుకుంటాను చెప్పండి! మీ వినోద్ జ్ఞాపకార్థం ఏదైనా ధర్మసంస్థకి యివ్వండి-నా రెక్కలతో నేను జీవిస్తాను” అంది.

“నీ చేతికి వచ్చిన తర్వాత నీ యిష్టంవచ్చినట్లు చేసుకో అమ్మా! నువ్వు మాతో వచ్చి యీ కష్టపమయంలో ఓదార్పు కలిగించవమ్మా” అన్నారు.

“ఇప్పుడు కాదండీ! తర్వాత వీలయితే వస్తాను” అంది రజని.

“కాదమ్మా! ఇప్పుడే నీఅవసరం మాకు చాలావుంది. నీవే మావద్ద లేకపోతే మేమిక జీవించలేము” అన్నారు.

రజని క్షణకాలం మౌనంవహించి, “సరేనమ్మా! ఆలాగే వస్తాను” అంది.

ఆ మరునాటి సాయంకాలం రజని రామంలాడ్జికి బయలుదేరింది. ఆమెను చూచి రామం ముఖంచిట్లించుకున్నాడు.

రజని నవ్వుతూ “కళావిహీనమైన మీ సుందరవదనం నాకు కలవర పాటు కలిగిస్తోంది రామంబాబు” అంది.

రామం కోపంతో “పర స్త్రీలు పరిహాసమాడితే నాకు పరమ అసహ్యం” అన్నాడు.

క్రూరత్వమయిన ఆ మాటలు ములుకుల్లా ఆమె హృదయంలో గుచ్చుకున్నాయి. వినోద్ పరిచయమయిన దగ్గర్నుంచీ ఆమె భరించిన భారం, అనుభవించిన బాధ, చేసిన త్యాగం అతను ఏమాత్రము గుర్తించలేకపోయాడు. అన్నాళ్ళనుంచి అణచివుంచిన అలసట వుబికి వచ్చింది. దగ్గరిలో వున్న కుర్చీలో కూలబడి నీరసంగా నవ్వి “పురుషులు పర స్త్రీలని పిలిచే వారంతా అందని ద్రాక్ష పళ్లు” అంది.

“జీవితంలో అందాన్ని మించిన అంతస్థులు కూడా వుంటాయి రజనీ! అది మరచి ప్రవర్తిస్తున్నావు, అందరు నీ సౌందర్యానికి దాసోహమవుతారనుకుంటున్నావు” అన్నాడు కోపంతో.

“ఇతరులగురించి నేనేమనుకున్నా మీ గురించి నేనలాగే అనుకుంటున్నాను రామంబాబు, అలసివచ్చాను. కాసిని మంచినీళ్లు యివ్వండి” అంది.

రామం అయిష్టంగానే లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చాడు. తిరిగి వచ్చేసరికి రజని గాఢనిద్రలో వుంది. సుందరమయిన ఆమె వదనం కాస్త వాడివుంది. మూసివున్న ఆ నేత్రాలలోంచి అలసట, అశాంతి తొంగిచూస్తున్నాయి. కాని రామాన్ని భయపెట్టి వళ్ళు జలదరింపజేసినది ఇంకొక విషయం. ఆమె ముఖానికి బొట్టు లేదు. అంతకుముందు కోపముతో ఆమెకేసి సరిగా చూడలేదు. ఎప్పుడు నిండుగా కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఆమెకు అలవాటు, రామానికి దుర్నివార్యంగా కన్నీరు వుప్పొంగివచ్చింది. వెంటనే లోపలికి వెళ్ళిఇల్లంతా గాలించాడు. కుంకుమ ఎక్కడా దొరకలేదు. చివరకు వీధిగుమ్మానవున్న కుంకుమ తీసి రామం కన్నీరు కారుస్తూ రజని ముఖాన బొట్టు పెట్టాడు. తాకిడికి రజనిని ఉలికిపడి లేచింది. చేత్తో ముఖం తడిమి చూచుకొని కుంకుమ చూచి నవ్వుతూ “పర స్త్రీ నిద్రిస్తున్నప్పుడు బొట్టు పెట్టడము పురుష లక్షణమా?” అంది.

రామం ఇంకా కన్నీరు కారుస్తూనే వున్నాడు. “అయితే యీ రోజు కుంకుమ ఎందుకు పెట్టుకోలేదు రజనీ!” అన్నాడు.

“కొన్నాళ్ళు వైధవ్యం పాటించాలని కోరిక కలిగింది వైధవ్యపు కఠోర నియమాలు ఆచరించి వాటి విలువ తెలుసుకోవాలనిపించింది. మన సమాజం స్త్రీలకు చేసే ద్రోహం అనుభవించి, ఆకళింపు జేసుకుందామనుకున్నాను. వచ్చిన యీఅవకాశాన్ని ఎందుకు జారవిడుచుకోవాలి? ఇదొక్కటేకాదు మిగతా నియమాలను కూడా ఆచరిస్తున్నాను” అంది.

రామం రజనికి ముఖం చూపించకుండా ప్రక్కకు తిరిగి కళ్లు తుడుచుకొంటూ “రజనీ! ప్రపంచంలో నువ్వెంతోమందికి నిస్వార్థంగా సహాయం చేస్తూవుంటావు నా యెడ నువ్వింత కఠినంగా, నిర్దాక్షిణ్యంగా ఎందుకు ప్రవర్తిస్తుంటావు రజని?” అన్నాడు.

రజని నవ్వుతూ “పర స్త్రీలమీద అధికారం చెలాయించేవారిని చూస్తే నాకు పరమ విసుగు” అంది.

రామం గద్గదస్వరంతో “నన్ను జీవచ్ఛవాన్ని చేసి, ఇంకా పరిహాసమెందుకాడతావు రజనీ?” అన్నాడు.

రామం ముఖం రజనికి కనబడడం లేదు. వెనుకకు తిరిగి నిలబడివున్నాడు. రజని కుర్చీలోంచి లేచి రామానికి ఎదురుగా నిలబడి “నేను అందుకు ఇక్కడకు రాలేదు రామంబాబూ! వీడ్కోలు చెప్పటానికి వచ్చాను'' అంది.

దగ్గరలో పిడుగుపడినట్లు వులికిపడ్డాడు రామం. “వీడ్కోలా! ఏమిటి వీడ్కోలు? ఎక్కడికి వెళుతున్నావు రజనీ!” అన్నాడు.

“నానుంచి దూరంగా వుండాలనే కోరికతో మీరు ఢిల్లి వదలి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తున్నారని విన్నాను. నా మూలంగా మీరిలా చెయ్యడం నాకిష్టం లేదు. అందుకనే నే వెళ్ళిపోతున్నాను. వినోద్ తల్లిదండ్రులతో కలసి కలకత్తా రేపే బయలుదేరి వెళుతున్నాను” అంది.

రామం హృదయం దుఖంతో నిండిపోయింది కలవరపాటు “కోపంతో నేనన్న మాటలని ఆధారం చేసుకొనినాకిలా అన్యాయం చేస్తావా రజనీ? ఇదివరకోసారి నిన్ను కాపాడుకొన్నాను. మళ్ళా యీసారి నన్నిలా ఎందు కేడిపిస్తావురజనీ” అన్నాడు.

“కష్టసమయంలో వారిని ఆదుకోవటం నా ధర్మం కాదా రామంబాబూ. ఏకైక పుత్రుడు మరణించాడు. కొన్నాళ్లు వారివద్ద వుంటే వారికి కొంత వూరటకలుగుతుంది కదా?” అంది.

“వారికి కలుగుతుంది రజనీ! కానీ ఎంత సేపూ ఇతరుల ధ్యానమే కానీ నా కష్టాలనిగురించి నువ్వెప్పుడూ ఆలోచించవు. నువ్వెంత నిర్లక్ష్యం చేసినా నీ వెంట గ్రహంలా తిరుగుతుంటానని నీకు తెలుసు” అన్నాడు.

రజని రామం కళ్ళల్లోకి మార్దవంతో చూస్తూ “కట్టుబాట్లు,క్రమబద్ధాలూ నాకు గిట్టవని మీకు తెలుసు రామంబాబు.అది తెలిసి కూడామీరు నాకు హృదయంలో చోటెందుకిచ్చారు?” అంది.

సూటి అయిన ప్రశ్న.. పొంగిపొర్లే దుఃఖాన్ని బలవంతాన అణచుకొంటూ “రాత్రింబవళ్ళు నేను పోరాడేను రజనీకి? కాని చివరకు నేను ఓడిపోయారు. ఇదంతా మొదటినుంచీ నీకు తెలుసు. అయినా నన్ను ఇలా ఎందుకడుగడుగునా అడుగుతుంటావు రజనీ?” అన్నాడు.

“మీకు కష్టం కలిగించినా ఒక మాట చెప్పక తప్పదు రామంబాబూ! కేవలం కష్టనష్టాలు, సుఖదుఃఖాలు నా జీవితానికి గీటురాయి కాదు. వాటికి వెరచి నేనేమి జీవితంలో సాధించలేను” అంది.

“అస్పష్టమైన నీ ఆశయాలకి నన్ను బలి చేస్తావారజనీ?” అన్నాడు.

“అలాంటి దుర్దినం రాకూడదనే నాఆశ రామం బాబూ! సమయానికి అందుబాటులోనే వుంటాను. కలకత్తా ఏమి పరదేశంకాదు, అవసరానికి నేను వెనుదీయనని మీకు మాట ఇస్తున్నాను. ఇక నన్ను సంతోషంతో సాగనంపండి” అంది.

“సరే రజనీ! వెళ్ళు. కాని వైధవ్యం పాటించనని నాకు మాటియ్యి. నేను ఇది సహించలేను” అన్నాడు.

“మాటిచ్చి తప్పాననే అభాండం కూడా నా మీద వెయ్య ప్రయత్నిస్తున్నారా! నాకేమి యిందులో నమ్మకం వుండి చెయ్యటం లేదు. అనుభవంకోసం,ఆత్మనిగ్రహం కోసమూ చేస్తున్నాను ఎప్పుడువిసిగితే అప్పుడే వదిలేస్తాను” అంది నవ్వుతూ.

“విచిత్రవ్యక్తిని అప్పుడప్పుడు తలచుకొంటూంటే భయంవేస్తోంటూంది రజని “మానసీకంగా నీ అంతస్థుకి అందే వ్యక్తులు ఎవరు లేరు” అన్నాడు.

“విచిత్రవ్యక్తిని కాదు రామంబాబూ వెర్రిదానిని” అంది రజని నవ్వుతూ.

 

చాప్టర్ 13

మరునాడు స్టేషన్ లో అందరు రజనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. రామం, విశాల, డాక్టర్ సనల్, కమల, కమలాకరం, ప్రసాద్, చంద్రిక అందరు వచ్చారు. ప్రసాద్ క్రితం రాత్రి ఢిల్లీ తిరిగి వచ్చాడు.

న్యూఢిల్లీ ప్లాటుఫారంమీద అందరు నిలబడి వున్నారు. ప్రసాద్ రజనితో “నాకు స్టేషన్ కి వచ్చి వీడ్కోలు చెప్పడం చేతిరుమాళ్ళు వూపడం ఇలాంటి పనులంటే ఇష్టం లేదు. రజనీ, అయినా నీ విషయంలో ఇన్స్పెక్షన్ చేసేను” అన్నాడు.

“అది మీ బలహీనత. నాయెడ గౌరవ సూచనమని నేను గర్వపడను” అంది రజని.

“అది నాకు తెలుసును రజనీ, కాని నాకు ఇది గర్వ కారణమే” అన్నాడు ప్రసాదు.

కమల కమలాకరం కాస్త దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. స్టేషన్ లో చాలా జనసమర్థంగా వుంది. చంద్రిక, విశాల, డాక్టర్, వృద్ధ దంపతులతో కబుర్లు చెప్పుతున్నారు. రైలు ప్లాటుఫారం మీదికి వచ్చే వేళయింది.

ప్రసాదు అక్కడకు వచ్చిన వద్ద నుంచీ కమలతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు, ముభావంగా ముడి మాటలు మాట్లాడి మౌనం వహించింది.

ప్రసాద్ నవ్వుతూ“కమలాకరం మా అన్యోన్యతను పదర్శించే తరుణం ఇది కాదోయి... ఇది రైల్వే ప్లాటు ఫారం?అన్నాడు.

కమల ముఖం కోపంతో ఎర్రపడింది. కమలాకరం నవ్వుతూ “అన్యోన్యతకి, ఆదర్శానికి సమయాసమములు వుండవని ప్రదర్శనకి పరిమితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయని రజని అంటుంది. కాని నేను ఒప్పుకోను” అన్నాడు.

“అయితే రజనిని మనస్సులో వుంచుకొని కమలతో కబుర్లు చెప్పుతున్నావా? కమలాకరం. కమల కది కఠిన శిక్ష” అన్నాడు ప్రసాదు.

కమల ముఖం సిగ్గుతో క్రుంగిపోయింది. ఇంతమంది ఎదుట అలాంటి పరిస్థితిలో అలాంటి మాటలు ఆమెకు రుచించలేదు. కానీ విచిత్ర విషయమేమిటంటే మామూలులాగా ఆమె కోపగించలేదు.

కమలాకరం భార్య పరిస్థితిని గమనించి నవ్వుతూ, “ఇది అన్యోన్యతని అర్థం చేసుకోలేని వారమనే మాటలు ప్రసాదు. ఈ విషయంలో రజని నీకు పాఠాలుచెప్పలేనట్లుంది” అన్నాడు.

ప్రసాదేదో సమాధానం చెప్పబోతూంటే చంద్రిక “నువ్వు పూరుకో మామయ్య, మీరు ఎప్పుడు అనవసరంగా వాదించుకుంటునే వుంటారు. రజని పిన్ని వెళ్ళిపోతుందనే దుఃఖం కూడా లేదు. మీకెవరకు” అంది.

“నన్ను కూడా వారితో జతపర్చకు చంద్రికా, ఇందాకటనుంచి నిశ్శబ్దంగా నేను నిరసన తెలియజేస్తున్నాను. అంది కమల.

రైలు ప్లాటుఫారం మీదికి నెమ్మదిగా వచ్చింది. స్టేషనంతా అల్లకల్లోలమయిపోయింది. రైలు నిలవకుండానే జనమంతా పరుగెత్తారు. కొంతమంది అతిచాకచక్యంతో లోనికి దుమికారు. జనసమర్థంలో ఒక యువకుడు రజనీని రాచుకొని వెళ్ళిపోయి “సారీ” అన్నాడు.

రజనీ నవ్వుతూ రామాని కేసి చూసింది. రామం అప్పటి వరకు రజని కేసి తదేకంగా చూస్తున్నాడు. రజని నేత్రాలు తన నేత్రాలను కలుసుకునేటప్పటికి కంగారుగా దృష్టి మరల్చాడు. అతను అంతవరకు గమనించిన దేమిటంటే రజని ముఖాన ఆనాడు కూడా బొట్టు లేదు. పైగా తెల్లటి చీర కూడా ధరించింది. సాధారణంగా రెండు జడలు వేసుకునే అలవాటు ఆమెది. కానీ ఆనాడు అతి సాధారణంగా జుట్టు సిగ చుట్టింది. కానీ ఈ విషయాలను ఇంకెవరు గుర్తించలేదు. రజనీకి తెల్లటి చీరలంటే ఆప్యాయత ఆనీ, అందరికును తెలుసును.విశాలకు తప్ప మిగతా వారికి వినోదు మరణ సమయంలో రజని అనిన మాటలు తెలియవు అందుకనే రజని రూపం ఎవరికి అనుమానం కలిగించ లేదు. విశాల చూచాయగా గ్రహించింది. కానీ రజని ఆమెతో ఏమి చెప్ప లేదు .

విశాల రజనిని కాస్త బయటకు లాగి, నెమ్మదిగా “'రజనీ' నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. అందుకు నేనేమి అనను. కాని వొక వ్యక్తి మరణంతో నీ కెక్కడా స్థానం లేదనుకోకు, అది మాఅందరికి అన్యాయం చెయ్యడమే కాదు, నీ గతాన్ని నీవు విస్మరించటం అవుతుంది.”

“ఆలాంటి భయమేమి లేదు విశాలా? గతాన్ని విస్మరించాలనే కోరిక నాలో లేదు. అంతా మధురస్మృతి కాక పోవచ్చు. కాని అంతా వొక విచారఘట్టం కూడా కాదు” అంది.

రజనితో ఏకాంతంగా మాట్లాడాలనే వాంఛ రామంలో రగుల్కొనివుంది. అవకాశంలేక అభిమానంతో అశాంతితో నిలబడి వున్నాడు, సమయం మించిపోతుందనే అమిత భయం వేసి అదే సమయమని, రజని దగ్గరకు వచ్చి “మీరు చెప్పవలసిందేమి లేదా రామంబాబు” అంది. రామం అసభ్యంగా “రజనీ నేను నీతో మాట్లాడాలి” అన్నాడు. కంఠస్వరంలో స్పష్టంగా జీరవుంది. బరువైన హృదయంతో రజని తనను నిర్లక్ష్యం చేస్తోందనే కోపంతో అనిన మాటలిని.

రజనీ నవ్వుతూ “మాట్లాడండి! రాంబాబు ఇందాకట నుంచి మీరే మౌనం వహించేరు?”అంది.

రజనీతో మాట్లాడాలనే తీక్షమైన కోరిక కలిగింది. కాని సమయానికి ఏమి మాట్లాడాలో వెంటనే స్ఫురణకు రాలేదు. రజని కేసి తీక్షణంగా చూస్తూ, “సహనం నాలో చాలా తక్కువని నీకు తెలుసు రజని, నువ్వు దానికి కఠినమయిన శిక్షకు గురిచేసావంటే ఫలితం నేనూహించ లేను”అన్నాడు.

రజని అప్యాయంగా “ఇంత వయసు వచ్చినా మీ హృదయం ఎందుకో లేత స్థితిలో వుండిపోయుంది రామంబాబూ. ఈ ప్రపంచంలో అలా జీవించేరంటే అడుగడునామీకు ఆశాభంగమే ఎదురవుతుంది. అది జరుగకుండానే దానిని గట్టి చేద్దామని ప్రయత్నిస్తున్నాను” అంది.

“నువ్వు ఏం చేసినా సహిస్తాను కాని, నాకు దూరం కావడం సహించలేను రజనీ!”.

“ఇది అనర్ధానికే దారితీస్తుంది రాంబాబు' అని రజని ఏదో అనబోతూంటే రామం అడ్డువచ్చాడు. “అదిసరే రజనీనువ్వు ఉత్తరాలు వ్రాస్తూంటానని నాకు మాటయియ్యి. లేకపోతే నీ ఎడబాటు సహించలేను” అన్నాడు.

“ఎందుకు వ్రాయను రామంబాబూ! తప్పక వ్రాస్తూంటాను. కాని ప్రేమ లేఖలు నేను వ్రాయను. అవి మీరు ఆశించవద్దు, మీరు ఏమి వ్రాయాలో వ్రాయవద్దు. అజ్ఞాపించే అధికారం మీకు లేదు” అంది.

రైలు కదలబోయే సమయం ఆసన్నమైంది. రజనీ అందరివద్ద వీడ్కోలు తీసుకుంది, చంద్రిక రజనితో “క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా” అంది. అందరు ఫక్కున నవ్వారు రజని రామందగ్గరకు వచ్చి “రామం బాబూ! తిరిగి ఎప్పుడు కలుసుకుందాము?” అంది నవ్వుతూ.

రజని కలకత్తా వెళ్ళి నెలరోజులు గడిచిపోయాయి. ఒక వ్యక్తి జీవితంలో ఇది ఎంతో అల్పమది, సంవత్సరాల కొలదీ శరవేగంతో మాయమవుతుంటాయి. వెనక చూపు చూచి అప్పుడప్పుడు మనం ఆశ్చర్య పోతూంటాము. అరె ఎంత త్వరగా గడిచిపోయాయి అని అనుకుంటాము. కాని అప్పుడప్పుడు దినాలు యుగాలుగా గడుస్తూంటాయి. ఎంత ప్రయత్నించినా కాలంగడవదు. విసిగి, వేసారి మాటిమాటికి ఎదురుగా కనబడే కేలండరు కేసి చిరుకోపంతో చూస్తూంటాము, అప్పుడు గడియారపుగంటలే శ్రావ్యంగా వినబడతాయి. గజగమనంతో తిరిగే చిన్నముల్లు మనకు చిరాకు కలిగిస్తుంది. కాని ఇది గమ్యస్థానమనే సుదినపు సూర్యోదయంకోసం ఎదురు చూసేవారికే వర్తిస్తుంది. వారే ఎదురు చూస్తూవుంటారు. శూన్యమయిన భవిష్యత్తుల వారికి గమనంతో నిమిత్తం లేదు. రామం రెండవ తరగతికి చెందిన వ్యక్తి. రజని ఎప్పుడు తిరిగిస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. రజని వెళ్ళిన మరుసటి దినం నుంచి ఆమె వద్దనుంచి జాబు వస్తుందేమోనని ఎదురు చూడసాగాడు. కలకత్తానుంచి వచ్చే ఉత్తరాలు మామూలుగా వుదయాన తొమ్మదిన్నరగంటలకి పోస్టుమెన్ఇవ్వడం అలవాటు. సరిగ్గా అదేసమయానికి రామం ఆఫీసుకి వెళ్ళవలసిన సమయం. రజని వద్దనుంచి ఉత్తరం వస్తుందనే ఆశతో ప్రతిరోజూ పోస్టుమెన్ వచ్చేవరకు ఎదురుచూస్తూ ఆఫీసుకి వెళ్లేవాడు. రెండు మూడు రోజులతర్వాత ఆఫీసులో చివాట్లు ప్రారంభమయినాయి. అయినా రోజూ ఆలస్యంగా వెళ్ళేవాడు. పోస్టుమెన్ వెళ్ళిన తరువాత అతనిని ఆవహించే నిరుత్సాహానికి, దుఃఖానికి, కోపానికి అంతులేదు. రజనికి వుత్తరం వాద్దామంటే అమె అడ్రస్ తెలియదు. ఈవిధంగా రెండు వారాలు గడిచి పోయాయి, విశాలకేమయినా కబురు తెలిసిందేమోనని ఆమె వద్దకు ఆ సాయంకాలం ప్రయాణమయ్యాడు. తీరా అక్కడకు వెళ్ళేసరికి డాక్టర్ సనల్ విశాల కలసి షికారు వెళ్ళారనీ అక్కడ వారు చెప్పారు. ఏమి చెయ్యటమా అని క్షణకాలం ఆలోచించి చివరకు వారిని వెదుకుతూ వెళ్ళాడు. దగ్గరలోనే కూర్చొని వారిద్దరు కబుర్లు చెప్పుకొంటున్నారు. రామాన్ని హఠాత్తుగాచూచి విశాల ఎందుకో చాలా సిగ్గుపడింది. ముఖం ఎర్రబడింది. అదే అతనికి ఆశ్చర్యం కలిగించింది. వారిద్దరి సంభాషణకి అంతరాయం కలిగించానేమోనని అనుమాన పడ్డాడు. డాక్టర్ సనల్ తో అట్టేఎక్కువ పరిచయం లేదు.

కంగారుపడుతూ “క్షమించు విశాలా! ఒక విషయం అడగటానికి వచ్చా” నన్నాడు.

విశాల సహజమైన మధుర స్వరంతో మందహాసం చేస్తూ “కూర్చోండి రామంబాబు. నేను చెప్పవలసినది కూడా ఇంకొక విషయం వుంది” అంది.

రామం అక్కడే కూర్చుని కొంచెం సిగ్గుపడుతూ “రజని వద్ద నుంచి ఏదైనా ఉత్తరంవచ్చిందా?” అన్నాడు.

“వెళ్ళిన వెంటనే ఉత్తరం వ్రాసింది రాంబాబు” అంది.

రామం మనస్సు చివుక్కుమంది. విశాలకీవ్రాసి తనకు వ్రాయలేదు. స్త్రీలంతా యింతేప్రేమించిన వారిని చులకన చేసి ఇతరుల ముందు చిన్న చూపు చూస్తారు.

కాంతివిహీనమైన వాని ముఖం చూసి విశాల” మీకు వ్రాయలేదా రామంబాబు'' అంది.

“వ్రాయలేదు విశాలా! వ్రాస్తే ఇక్కడకు ఎందుకు వస్తాను” అన్నాడు.

“అందుకోసమే రానవసరం లేదు రామంబాబు. నేనేమీ మీకు పరాయి దానను కాను. నన్ను చూడటానికి రావచ్చుగా?” అంది.

“పరాయిదానవని నేననటం లేదు విశాలా! కాని నాకంటే ఆప్తులని ఎవరిని అనుకొంటున్నానో వారే. నన్ను పరాయివారిగా భావిస్తున్నారు” అన్నాడు.

ఆమె అతని మాటలను అర్థం చేసుకొంది. మనస్సులో భావం

1 ... 10 11 12 13 14 15 16 17 18 ... 21
Go to page:

Free ebook «అప్రాశ్యులు by Bhimeswara Challa (the reading list book TXT) 📖» - read online now

Comments (0)

There are no comments yet. You can be the first!
Add a comment